- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఇండోనేషియా ఓపెన్ 2021 క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేవించింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో దక్షిణ కొరియాకు చెందిన యూ జిన్ సిమ్పై 14-21, 21-19, 21-14 తేడాతో విజయం సాధించింది. గంటా 6 నిమిషాల పాటు సాగిన సుదీర్ఘ మ్యాచ్లో తొలి గేమ్ను పీవీ సింధు ఓడిపోయింది.
కానీ ఆ తర్వాత తన క్లాసైన ఆటతీరుతో ప్రత్యర్థిపై ఆధిపత్యం సాధించింది. 2, 3 గేమ్స్ గెలిచి సెమీస్లో బెర్త్ కన్ఫార్మ్ చేసుకున్నది. శనివారం జరిగే సెమీఫైనల్ మ్యాచ్లో రాట్చనోక్ ఇంటానన్తో తలపడనున్నది. పురుషుల సింగిల్స్లో బి సాయి ప్రణీత్ 12-21, 8-21 తేడాతో వరల్డ్ నెంబర్ 2 విక్టర్ అక్సెల్సేన్ చేతిలో ఓడిపోయాడు. దీంతో అతడి ప్రయాణం క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. పురుషుల డబుల్స్లో భారత షట్లర్లు సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి జోడి 21-19, 21-19 తేడాతో మలేషియాకు చెందిన గో సీ ఫె – నుర్ ఇజుద్దీన్ జోడీపై విజయం సాధించి సెమీఫైనల్ చేరుకున్నారు.
- Tags
- Indonesia open