క్వార్టర్‌ ఫైనల్‌లోకి పీవీ సింధు

by  |
క్వార్టర్‌ ఫైనల్‌లోకి పీవీ సింధు
X

దిశ, స్పోర్ట్స్ : బ్యాంకాక్ వేదికగా జరుగుతున్న టొయోటా థాయిలాండ్ ఓపెన్ 2021లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్‌లోకి ప్రవేశించింది. గురువారం మలేషియాకు చెందిన కిసోనా సెల్వదురైతో తలపడిన పీవీ సింధు 21-10, 21-12 వరుస గేమ్స్‌లో విజయం సాధించింది. తొలి రౌండ్‌లో బుసానన్‌ను ఓడించిన సింధు, రెండో రౌండ్‌లో సెల్వదురైను ఓడించి నేరుగా క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. ఇక పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లోనే హెచ్ఎస్ ప్రణయ్ వెనుదిరిగాడు. మలేషియాకు చెందిన లూయీ డారెన్‌తో జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో 17-21, 18-21 తేడాతో ఓటమిపాలయ్యాడు. మరోవైపు సమీర్ వర్మ డానిష్ ప్లేయర్ రాస్మస్ గేమ్కేను ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌లోకి దూసుకెళ్లాడు. మిక్స్‌డ్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డి, అశ్వని పొన్నప్పల జంట క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది. పురుషుల డబుల్స్‌లో చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్ జోడి దక్షిణ కొరియాకు చెందిన చోయ్ సాల్ గు, సియో సెంగ్ జోడీని ఓడించి ముందుకు వెళ్లారు.


Next Story

Most Viewed