ఇండోనేషియా మాస్టర్స్ సెమీఫైనల్‌లో శ్రీకాంత్, పీవీ సింధు

by  |
ఇండోనేషియా మాస్టర్స్ సెమీఫైనల్‌లో శ్రీకాంత్, పీవీ సింధు
X

దిశ, స్పోర్ట్స్: ఇండోనేషియా మాస్టర్స్ 2021 సెమీఫైనల్‌లోకి భారత స్టార్ షట్లర్లు దూసుకెళ్లారు. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్‌లో కిదాంబి శ్రీకాంత్ 21-7, 21-18 తేడాతో హెచ్ఎస్ ప్రణయ్‌పై విజయం సాధించాడు. తొలి గేమ్‌లో ఆధిపత్యం ప్రదర్శించిన శ్రీకాంత్.. రెండో గేమ్‌లో ప్రణయ్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్నాడు. హోరాహోరీగా జరిగిన రెండో గేమ్‌లో చివరకు శ్రీకాంత్‌దే పై చేయి అయ్యింది. ఈ విజయంతో శ్రీకాంత్ సెమీస్‌లో ప్రవేశించాడు. సెమీస్‌లో అతడు 3వ సీడ్ ఆండ్రెస్ ఆంటొన్‌సేన్‌తో తలపడనున్నాడు. ఇక మహిళల సింగిల్స్‌లో నీస్లిహాన్‌పై పీవీ సింధు 21-13, 21-10 తేడాతో విజయం సాధించింది. రెండు గేమ్‌లలోనూ సింధు పూర్తిగా డామినేట్ చేసింది. ప్రత్యర్థికి ఏ మాత్రం చాన్స్ ఇవ్వకుండా స్మాష్‌లు, డ్రాప్ షాట్‌లు ఆడుతూ విజయం సాధించి సెమీస్‌లోకి ప్రవేశించింది. పీవీ సింధు సెమీస్‌లో టాప్ సీడ్ యమగుచితో తలపడనున్నది.


Next Story

Most Viewed