నిజంగా.. గర్వంగా ఉంది : ఉత్తమ్

by  |
నిజంగా.. గర్వంగా ఉంది : ఉత్తమ్
X

దిశ, వెబ్ డెస్క్: ఈనెల 24న ఇందిరాభవన్ లో పీవీ శతజంయతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పీవీ శతజయంతి వేడుకలు నిర్వహించుకోవడం గర్వంగా ఉందన్నారు. పీవీ వంద శాంత కాంగ్రెస్ వాది అని, జూమ్ యాప్ ద్వారా శతజయంతి ఉత్సవాల్లో మన్మోహన్ సింగ్, జైరాం రమేష్, చిదంబరం మాట్లాడుతారన్నారు. సోనియాగాంధీ, రాహుల్, ప్రణబ్ ముఖర్జీ, శరద్ పవార్ లు సందేశం పంపుతారని తెలిపారు. పీవీ కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని చెప్పారు. అన్ని జిల్లాల్లో ఏడాదిపాటు పీవీ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో ఎస్సీలపై జరుగుతున్న వరుస దాడులకు నిరసగా ఈనెల 26న ఆందోళన నిర్వహిస్తామని ఉత్తమ్ చెప్పారు.

Next Story

Most Viewed