వెల్‌కమ్ పవర్ స్టార్ :పూరి

by  |
వెల్‌కమ్ పవర్ స్టార్ :పూరి
X

దిశ, వెబ్‌డెస్క్: శాండల్‌వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ తొలిసారిగా తెలుగులో తన సినిమా రిలీజ్ చేయబోతున్నారు. ఇండియన్ సినిమా చరిత్రలోనే 90 శాతం సక్సెస్ రేట్‌తో దూసుకుపోతున్న ఆయన.. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుండగా ఆల్ ది బెస్ట్ చెప్తూ వెల్‌కమ్ చెప్పారు డైరెక్టర్ పూరీ జగన్నాధ్. ‘కేజీఎఫ్’ సినిమా ప్రొడ్యూసర్స్ నుంచి రిలీజ్ అవుతున్న ఈ సినిమా టైటిల్ ‘యువరత్న’ కాగా.. సంతోష్ అనాంద్రం డైరెక్టర్. ఎస్‌ఎస్. థమన్ స్వరాలు సమకూరుస్తున్న సినిమాలో సయేషా సైగల్ హీరోయిన్. డిసెంబర్ 2న యువరత్న పవర్ ఆఫ్ యూత్ సింగిల్ రిలీజ్ కాబోతుంది. నకష్ అజీజ్ పాడిన పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు.

https://twitter.com/purijagan/status/1330745976869449730?s=19

కాగా, పూరీ జగన్నాధ్ పునీత్ రాజ్ కుమార్‌తో కలిసి ‘అప్పు’ సినిమా చేశారు. 2002లో రిలీజైన ఈ చిత్రం ‘ఇడియట్’కు రీమేక్ కాగా, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. రూ. 2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా థియేటర్స్‌లో 200 రోజులు ప్రదర్శించబడి రికార్డ్ క్రియేట్ చేసింది.



Next Story

Most Viewed