ఢిల్లీ జోరుకు పంజాబ్ బ్రేక్ వేసేనా?

by  |
ఢిల్లీ జోరుకు పంజాబ్ బ్రేక్ వేసేనా?
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌ 2020లో భాగంగా నేడు మరో రసవత్తర పోరు జరుగనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్‌లో వరుస విజయాలతో ఢిల్లీ జట్టు దూసుకెళ్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అదరగొడుతోంది. అంతేగాకుండా ఇటు పంజాబ్ కూడా యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ రాకతో వరుసగా రెండు మ్యాచ్‌లు విజయం సాధించి, ఆత్మవిశ్వాసంతో ఉంది. అయితే పంజాబ్ జట్టుకు ఈ మ్యాచ్ కీలకం కానుంది. ప్లేఆఫ్‌కు చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌లు పంజాబ్ గెలిచి తీరాల్సిందే. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.

Next Story

Most Viewed