కుప్పకూలిన పంజాబ్ టాప్ ఆర్డర్

by  |
కుప్పకూలిన పంజాబ్ టాప్ ఆర్డర్
X

దిశ, వెబ్‌డెస్క్ : ఢిల్లీ కాపిటల్స్ విధించిన 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు పీకల్లోతూ కష్టాల్లో మునిగిపోయింది. ఢిల్లీ బౌలర్ల దెబ్బకు పంజాబ్ ఓపెనర్లు రాహుల్ 15(11), మయాంక్ అగర్వాల్ 5(9) త్వరగా పెవిలియన్ చేరారు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన విధ్వంసక బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ తొలుత తన పవర్ పంచ్‌ను ఢిల్లీ బౌలర్లకు రుచి చూపించాడు.

రావడం రావడమే ఫోర్లు, సిక్సులతో విరుచుక పడ్డాడు. గేల్ క్రీజులో కుదురుకున్నాడు పంజాబ్ విజయం తథ్యం అనుకునేలోపే అభిమానుల ఆశలపై బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ నీళ్లు చల్లాడు. ఐదో ఓవర్లో వేసిన రెండో బంతికి క్రిస్ గేల్ 29(13) పరుగుల వద్ద బౌల్డ్ అయ్యాడు. దీంతో పంజాబ్ (56-3) స్కోర్ వద్ద టాప్ ఆర్డర్లను త్వరగా కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో మునిగిపోయింది.

Next Story

Most Viewed