ఆర్సీబీని చిత్తు చేసిన పంజాబ్ కింగ్స్

by  |
ఆర్సీబీని చిత్తు చేసిన పంజాబ్ కింగ్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 26వ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై పంజాబ్ కింగ్స్ ఆధిపత్యం చెలాయించింది. 34 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీకి అంచనాలు తలక్రిందులు అయ్యాయి. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 179 పరుగులు చేసింది. ఇక నిర్ణీత 20 ఓవర్లలో 180 పరుగులు ఛేదించే క్రమంలో ఆర్సీబీ 145 పరుగులకే పరిమితం అయింది. విరాట్ కోహ్లీ(35), రాజత్ పటిదార్ (31), హర్షల్ పటేల్(31) పరుగులతో రాణించినా.. మిగతా బ్యాట్స్‌మాన్‌లు విఫలమయ్యారు. ముఖ్యంగా దేవదత్ పడిక్కల్ (7) ఏబీ డివిలియర్స్ (3), గ్లెన్ మ్యాక్స్‌వెల్ డకౌట్ కావడంతో జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇదే క్రమంలో వరుసగా వికెట్లు పారేసుకుంది ఆర్సీబీ. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 145 పరుగులకే సరిపెట్టుకుంది.

Next Story

Most Viewed