120 పరుగులకే కుప్పకూలిన పంజాబ్‌ కింగ్స్

by  |
120 పరుగులకే కుప్పకూలిన పంజాబ్‌ కింగ్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 14వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మాన్‌లు చేతులెత్తేశారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నప్పటికీ అంచనాలు తారుమారు అయ్యాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ వేసి 120 పరుగులకే పంజాబ్ కింగ్స్‌ను కుప్పకూల్చారు. ఏ ఒక్క ఆటగాడు కూడా కనీసం 25కు మించి పరుగులు చేయకపోవడం దారుణం. మయాంక్ అగర్వాల్ (22), షారుఖ్ ఖాన్ (22), క్రిస్ గేల్ (15), హెన్రీక్స్ (14) పరుగులు మాత్రమే చేయగా.. మిగతా బ్యాట్స్‌మాన్‌లు పట్టుమని 10 పరుగులు చేయకుండానే పెవిలియన్ చేరారు. దీంతో 19.4 ఓవర్లలోనే 120 పరుగులకు పంజాబ్ కింగ్స్ కుప్పకూలింది. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన SRH ఈ మ్యాచ్‌లోనైనా నెగ్గుతుందో లేదో వేచిచూడాల్సిందే.

Next Story

Most Viewed