పంజాబ్ ఓపెనర్లు అదరహో

by  |
పంజాబ్ ఓపెనర్లు అదరహో
X

దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్‌ బ్యాట్స్‌మెన్ మయాంక్ అగర్వాల్ మరోసారి చెలరేగిపోయాడు. షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న రాజస్తాన్ రాయల్స్ -కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో పంజాబ్‌ ఓపెనర్లు మయాంక్ అగర్వాల్-కేఎల్ రాహుల్ అద్భత ఇన్నింగ్స్‌ ఆడుతున్నారు. ముఖ్యంగా మయాంక్ అగర్వాల్ తొలి 12 ఓవర్లలో కేవలం 38 బంతుల్లో 81 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు, 6 సిక్సర్లు బాది రాజస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. సెంచరీ వైపు శర వేగంగా దూసుకుపోతున్నాడు.

అటు కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనను కనబరుస్తున్నాడు. 35 బంతుల్లో హాఫ్ సెంచరీని (50) పూర్తి చేసుకున్నాడు. ఇందులో భాగంగానే కేఎల్ రాహుల్ 5 ఫోర్లు, 1 సిక్సర్‌ బాదాడు. ఐపీఎల్ చరిత్రలో ఓపెనర్లు ఇద్దరు కలిసి 140 చేయడం గమనార్హం. తొలి 12 ఓవర్లకు పంజాబ్ 140/0 ఉండటం ఇదే తొలిసారి.


Next Story