- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
టీమ్ ఇండియా నయా వాల్ చతేశ్వర్ పుజారాతో గ్లూసెస్టర్షైర్ కౌంటీ చేసుకున్న ఒప్పందం రద్దయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న సమయంలో ఇంగ్లాండ్లో జరగాల్సిన అన్నిరకాల క్రికెట్ టోర్నీలను ఈసీబీ మే 28 వరకు రద్దు చేసింది. షెడ్యూల్ ప్రకారం కౌంటీ చాంపియన్షిప్ ఈ నెల 12 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, ఈసీబీ నిర్ణయంతో మ్యాచ్లు వాయిదా పడ్డాయి. కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా రద్దు కావడంతో పుజారా కౌంటీ క్రికెట్ ఆడే అవకాశం లేదు. దీంతో ఈ ఏడాదికి గ్లూసెస్టర్షైర్ తమ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ‘ఈ సీజన్లో పుజారాను తాము మిస్ అవుతున్నామని’ గ్లూసెస్టర్షైర్ పేర్కొంది. ఇంగ్లాండ్ కౌంటీల్లో పుజారా అంతకు మునుపు డెర్బీషైర్, యార్క్షైర్, నాటింగ్హామ్షైర్ తరఫున ఆడిన విషయం తెలిసిందే.
Tags: Pujara, County cricket, Gloucestershire, England