అయ్యప్ప ఆలయ నిర్మాణానికి భూమి పూజ.. పాల్గొన్న మక్తల్ ఎమ్మెల్యే

by  |
Makthalu-1
X

దిశ, మక్తల్: నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని ఊట్కూర్ మండలం పూలిమడి గ్రామంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన అయ్యప్ప స్వామి దేవాలయానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రంలో మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అయ్యప్ప ఆలయ నిర్మాణానికి పూనుకోవడం సంతోషకరమన్నారు. ఆలయ నిర్మాణానికి తన వంతుగా సహకరిస్తానని ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాల ధరించిన స్వాములు, గ్రామస్తులు, నాయకులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed