కలెక్టర్ శర్మన్‌కు ప్రజల ప్రశంసలు

by  |
కలెక్టర్ శర్మన్‌కు ప్రజల ప్రశంసలు
X

దిశ ప్రతినిది, మహాబూబ్ నగర్: నాగర్ కర్నూల్ కలెక్టర్ శర్మన్ తన దాతృత్వం చాటుకున్నారు. గురువారం జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న ఆయన శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. అదే సమయంలో ఆసుపత్రిలో గర్భిణి మహిళకు ఓ నెగెటివ్ రక్తం అవసరం ఉన్న విషయం తెలుసుకున్న కలెక్టర్ శర్మన్ తన దాతృత్వాన్ని చాటారు. తనది కూడా ఓ నెగిటివ్ గ్రూప్ రక్తం కావడంతో తక్షణమే ఆయన రక్తదానం చేశారు. గర్భిణి మహిళకు రక్తదానం చేసిన శర్మన్ పై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story