ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు….

by  |
ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు….
X

దిశ, దుబ్బాక : రెండుసార్లు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారని, ప్రస్తుతం వారు మార్పు కోరుకుంటున్నారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆకారం గ్రామంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు తరపున ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….కేంద్రం ఇస్తున్న సంక్షేమ పథకాలకు రంగులు రుద్ది వాటిని తమ ప్రభుత్వం ఇస్తున్నట్టు ప్రచారం చేసుకునే టీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మరని తెలిపారు. ఎన్నికల ముందు ఎన్నో చెప్పి, గడిచిన ఆరేళ్లలో ఏ ఒక్క పని చేయలేదని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. దుబ్బాకలో బీజేపీ గెలుపు ఖాయమైందని, మెజారిటీ కోసమే తాము ప్రచారం చేస్తున్నామని అన్నారు.

Next Story