ఇండియాలో మళ్లీ పబ్జీ..!

by  |
ఇండియాలో మళ్లీ పబ్జీ..!
X

న్యూఢిల్లీ: ఇండియాలో మళ్లీ పబ్జీ గేమ్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు పబ్జీ కార్పొరేషన్ తెలిపింది. ప్రత్యేకంగా ఇండియన్ ప్లేయర్స్ కోసం పబ్జీ మొబైల్ ఇండియా పేరిట కొత్త గేమ్‌ను తీసుకురానున్నట్టు ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం పబ్జీ గేమ్‌పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఇకపైన ఇండియాలో పబ్జీ మొబైల్ ఫ్రాంచైజీని చైనాకు చెందిన సంస్థలకు ఇవ్వబోమని పబ్జీ కార్పొరేషన్ ప్రకటించింది.

అక్టోబర్ 30 నుంచి ఇండియాలో వినియోగదారులకు పబ్జీ డౌన్‌లోడ్‌ను నిలిపివేస్తున్నామని కూడా తెలిపింది. అయితే, ఆండ్రాయిడ్, ఐఓఎస్ పరికరాల్లో ఈ గేమ్‌ను ఇన్‌స్టాల్ చేసి ఉంటే పబ్జీ ఆడవచ్చునని పేర్కొంది. తాజాగా ఇండియన్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని పబ్జీ మొబైల్ ఇండియా పేరిట కొత్త గేమ్‌ను తీసుకుస్తున్నట్టు పబ్జీ కార్పొరేషన్ ప్రకటించింది. కొత్త గేమ్ డేటా సెక్యూరిటీతోపాటు ఇండియా నియమనిబంధనలకు అనుగుణంగా ఉంటుందని తెలిపింది.


Next Story

Most Viewed