జూబ్లీహిల్స్‌లో పబ్ సీజ్

by  |

దిశ, న్యూస్‌బ్యూరో: లాక్‌డౌన్ నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలు చేపడుతున్న పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి సీజ్ చేశారు. పబ్‌ నుంచి రూ.15లక్షల విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. లాక్‌డౌన్‌లోనూ మద్యం అమ్ముతున్నారన్న సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ జూబ్లీహిల్స్ సీక్రెట్ అఫైర్స్ పబ్‌‌పై శుక్రవారం దాడులు చేశారు. దాడిలో ఓ నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసును జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు.

Tags: Lockdown, pub, Taskforce, wine, crime, hyderabad

Next Story