సైకో హల్‌చల్.. బాలిక ఇంటిపై కత్తితో దాడి

by  |
Psycho Attack
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలోని నాలేశ్వర్ గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున యువకుడు ముగ్గురిపై కత్తితో దాడికి దాడికి తెగబడ్డారు. వివరాళ్లోకి వెళితే.. నాలేశ్వర్ గ్రామానికి చెందిన సాయిరాం అనే యువకుడు తరచూ ఓ మైనర్ బాలికను వేధింపులకు గురిచేసేవాడు. ఈ విషయం తెలిసిన బాలిక కుటుంబసభ్యులు సోమవారం సాయిరాంను మందలించారు. తీవ్ర మనస్థాపానికి గురైన సాయిరాం సైకోగా మారి అర్ధరాత్రి బాలిక ఇంటిపై దాడికి తెగబడ్డాడు. అడ్డొచ్చిన రాయల పెద్దపోశెట్టి, రాయల నడపిపోశెట్టి, రాయల శ్రీకాంత్‌లను కత్తితో పొడిచి హల్‌చల్ చేశాడు. దీంతో తీవ్రగాయాలైన వారిని నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. అందులో ఒకరికి సీరియస్‌గా ఉండటంతో హుటాహుటిన హైదరాబాద్‌ తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఇరు కుటుంబాల బీజేపీ, టీఆర్ఎస్‌లు కావడంతో వివాదం పెద్దదికాకుండా చూస్తామని ఎస్ఐ యాకూబ్ తెలిపారు.



Next Story

Most Viewed