- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తుతున్నాయి. ఉప్పల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు ముందు డాక్యుమెంట్స్ & రైటర్స్ ఫెడరేషన్ ధర్నా నిర్వహించింది. హయత్నగర్-విజయవాడ జాతీయ రహదారిపై ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ, టీడీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. పాత పద్దతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు కరీంనగర్లో రిజిస్ట్రేషన్లు మందకొడిగా సాగుతున్నాయి. ఇవాళ కేవలం 6 స్లాట్స్ మాత్రమే బుకింగ్ జరిగింది. పలు కార్యాలయాల్లో సర్వర్లు మొరాయిస్తున్నాయి. ఎమ్మెల్యే గాంధీ, ఎమ్మెల్సీ నవీన్కుమార్లకు వెస్ట్ జోన్ బిల్డర్ అసోసియేషన్ సభ్యులు వినతిపత్రం అందజేశారు. పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు కొనసాగించాలని కోరారు. ఇక ఆదిలాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు నెమ్మదిగా సాగుతున్నాయి. ఇప్పటివరకు కేవలం 3 స్లాట్ బుకింగ్లు నమోదయ్యాయి.