బ్రేకింగ్.. మంత్రులు ఎర్రబెల్లి, సబితా ఇంద్రారెడ్డికి నిరసన సెగ

by  |
Ministers Convoy
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండల కేంద్రంలో బీజేవైఎం నాయకులు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రా రెడ్డి కాన్వాయ్‌ను అడ్డగించారు. ఈ సందర్భంగా నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీని అమలు చేయాలని నినాదాలు చేశారు. అదే విధంగా మండల కేంద్రంలో రోడ్లు పూర్తిగా డ్యామేజ్ అయ్యాయని, లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ యువకులు మంత్రుల కార్లను అడ్డగించారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు బీజేవైఎం నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

భారీగా వరదనీరు.. ఎస్‌ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ 8 గేట్లు ఎత్తివేత

Next Story

Most Viewed