- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఆయనకు వరద బాధితుల నిరసన సెగ తగిలింది. వివరాల ప్రకారం.. సజ్జల మంగళవారం అన్నమయ్య జలాశయం కట్టతెగి ముంపునకు గురైన పులపుత్తూరు, గుండ్లూరు, మందపల్లి, తొగురుపేట గ్రామాల్లో పర్యటించారు.
ఈ సందర్భంగా బాధితులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ వర్షాల కారణంగా తాము సర్వం కోల్పోయి రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇస్తున్న పరిహారం ఏమూలకు సరిపోతుందని ప్రశ్నించారు. పులపుత్తూరు గ్రామస్తులు ఆయన ఎదుటే ఆగ్రహం వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. అకాల వర్షాల కారణంగా జలాశయాలు కట్టలు తెగి ప్రాణ, ఆస్తినష్టం జరిగిందన్నారు. వరదల్లో ఇళ్లను కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. ఐదు సెంట్ల స్థలంలో కొత్తగా ఇళ్లను నిర్మించి ఇస్తామని తెలిపారు. దీంతో గ్రామస్తులు కొంత శాంతించారు.