ప్రజా సమస్యలు పట్టించుకోట్లేదు: ఉత్తమ్

by  |
ప్రజా సమస్యలు పట్టించుకోట్లేదు: ఉత్తమ్
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: ప్రజా సమస్యలను పట్టించుకోకుండా వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. కరోనా కాలంలో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలలను పెంచడం సరికాదన్నారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. శనివారం శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉత్తమ్ హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో చల్లా నర్సింహరెడ్డి, మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, శంషాబాద్ అధ్యక్షుడు సంజయ్ పాల్గొన్నారు.

Next Story

Most Viewed