ఎక్సైజ్​ శాఖలో త్వరలోనే పదోన్నతులు

by  |
ఎక్సైజ్​ శాఖలో త్వరలోనే పదోన్నతులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ఆబ్కారీ శాఖలో త్వరలోనే పదోన్నతులు కల్పిస్తామని ఆ శాఖ కమిషనర్​ సర్ఫరాజ్​ అహ్మద్​ పేర్కొన్నారు. ఆబ్కారీ గెజిటెడ్​ అధికారుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం కమిషనర్​ సర్ఫరాజ్​ అహ్మద్​ను కలిసి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల పదోన్నతుల అంశంలో నిర్ణయం తీసుకుంటామని సర్ఫరాజ్​ అహ్మద్​ వెల్లడించారు. కార్యక్రమంలో అబ్కారీ గెజిటెడ్​ అధికారుల సంఘం అధ్యక్షుడు టి.రవీందర్​రావు, టీజీవో ప్రధాన కార్మదర్శి సత్యనారాయణ, కోశాధికారి తమటం లక్ష్మణ్​ గౌడ్​, సహాధ్యక్షుడు శ్రీనివాస్​రెడ్డి పాల్గొన్నారు.

Next Story

Most Viewed