నిజామాబాద్ సీపీని కలిసిన ఎస్సైలు 

by  |
నిజామాబాద్ సీపీని కలిసిన ఎస్సైలు 
X

దిశ , నిజామాబాద్ : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సీనియార్టీ ప్రకారం ఏఎస్ఐల నుంచి ఎస్‌ఐలుగా పదోన్నతి పొందిన 13 మంది జిల్లా కమిషనరేట్‌లో సీపీ కార్తికేయను మర్యాద పూర్వకంగా కలిశారు. మంగళవారం వీరందరికీ సబ్ ఇన్‌స్పెక్టర్ స్థాయి హోదా కల్పిస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. వెస్ట్‌జోన్ పరిధిలో 39 మంది ఏఏస్ఐ లకు సబ్ ఇన్‌స్పెక్టర్ లుగా ఈ నెల 2న పదోన్నతి కల్పించారు. ప్రమోషన్ వచ్చిన ఎస్ఐలకు త్వరలోనే వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు కేటాయించనున్నట్లు కమిషనర్ కార్తీకేయ తెలిపారు.

Next Story