3 రోజుల నుంచి చెట్టు కిందే కరోనా పేషెంట్లు

by  |
3 రోజుల నుంచి చెట్టు కిందే కరోనా పేషెంట్లు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత కరోనా కష్ట కాలంలో కొందరు వ్యక్తుల తీరు అవమానవీయంగా ఉంది. ఇటు వీళ్లే కాదు.. అటు అధికారుల తీరుగా అలాగే ఉంది. తమకు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఏ మాత్రం బాధ్యతగా వ్యవహరించడంలేదు. సాటి మనిషి అన్న మానవత్వం కూడా వారిలో కనిపించడంలేదు.

తాజాగా ఆంధ్రప్రదేశ్ లో కూడా కరోనా సోకినవారి పట్ల దారుణంగా వ్యవహరించారు అధికారులు. విజయనగరంలోని సాలూరు మండలం కరాసువలసలో 20 మందికి కరోనా సోకింది. దీంతో వారిని ఊరిలోకి రానివ్వలేదు. దీంతో వారు మూడ్రోల నుంచి ఊరు చివర ఓ చెట్టు కింద తలదాచుకుంటున్నారు. వీరిని క్వారంటైన్ సెంటర్ కు పంపించాల్సిన అధికారులు కూడా తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. కనీసం వీరికి ఆహారం, నీరు, సదుపాయాలు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎవరైనా స్పందించి తమకు ఆహారం అందించాలని వారు కోరుతున్నారు.

Next Story

Most Viewed