నాడు టీచర్.. నేడు కూలీ

by  |
నాడు టీచర్.. నేడు కూలీ
X

దిశ, దుబ్బాక: విద్యారంగంపై కరోనా తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. స్కూల్స్ మూతపడటంతో యాజమాన్యాలు టీచర్లకు వేతనాలు ఇవ్వలేని దుస్థితి ఏర్పడింది. దీంతో పొట్టకూటి కోసం కూలినాలి చేసుకుంటూ జీవనం కొనసాగించాల్సి వస్తోంది. పైన చిత్రంలో ఉన్న వ్యక్తి మిరుదొడ్డికి చెందిన గణపతి. ఈయన గత 23 సంవత్సరాలుగా ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. కరోనా కారణంగా గత మూడు నెలల నుంచి స్కూల్ ప్రారంభం కాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. దీంతో ప్రతిరోజు సెంట్రింగ్ మేస్త్రీ వద్ద కూలి పని చేస్తూ జీవనాన్ని నెట్టుకొస్తున్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులను ఆదుకోవాలని కోరారు.



Next Story

Most Viewed