బైక్‌ను వెనక నుంచి వేగంగా ఢీకొన్న బస్సు

by  |
బైక్‌ను వెనక నుంచి వేగంగా ఢీకొన్న బస్సు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో గత మూడ్రోజులుగా రోడ్డు ప్రమాదాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. నిన్న మాదాపూర్‌లో కారు బీభ్సత్సం సృష్టించడంతో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం చెందిన ఘటన, కొత్తపేట పండ్ల మార్కెట్ వద్ద ప్రమాదాలను మరువక ముందే దుండిగల్ పోలీస్ పరిధిలోని గండిమైసమ్మ వద్ద సోమవారం మధ్యాహ్నం ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న వారిని వెనుక నుంచి ప్రైవేట్ బస్సు వేగంగా ఢీకొనడంతో మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. బైక్ నడిపే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని గాయాలపాలన వ్యక్తిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Next Story

Most Viewed