లోయలో పడ్డ బస్సు.. 25 మందికి గాయాలు

by  |
లోయలో పడ్డ బస్సు.. 25 మందికి గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఒడిశా రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కందమాల్‌ జిల్లా గడియాపాడఘాట్ వద్ద ఓ ప్రైవేటు బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రైవేటు బస్సు పుల్‌వాని నుంచి భువనేశ్వర్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.



Next Story

Most Viewed