కడప జైలులో కరోనా కలకలం..

by  |
కడప జైలులో కరోనా కలకలం..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. వైరస్ వ్యాప్తి నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం మాత్రం ఆశించినంత మేర కనిపించడం లేదు. ఇన్నిరోజులు రాజకీయ నాయకులు, కరోనా వారియర్లు, ఆలయ సిబ్బందిని భయపెట్టిన కరోనా తాజాగా ఖైదీలను కూడా భయాందోళనకు గురిచేస్తోంది.

ఈ నేపథ్యంలోనే కడప జైలులో 303 మంది ఖైదీలు, 14 మంది సిబ్బందికి వైరస్‌ నిర్ధారణ అయింది. ఖైదీలు, సిబ్బంది సహా 700 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, అందులో 317 మందికి పాజిటివ్‌గా తేలింది. గతవారం నిర్వహించిన పరీక్షల్లో 19 మందికి వైరస్‌ నిర్దారణ అయ్యిటన్లు అధికారులు ధృవీకరించారు.

Next Story

Most Viewed