- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ఏపీ బ్యూరో: విద్యార్థులకు చదువు చెప్పాల్సిన ఓ ప్రిన్సిపాల్ దారి తప్పాడు. తన బిడ్డలా చూసుకోవాల్సిన విద్యార్థిని పట్ల కామంధుడిలా మారాడు. తన కోరిక తీరిస్తేనే ప్రాక్టికల్స్ పాస్ చేస్తానని లేదంటే ఫెయిల్ చేస్తానని బెదిరించాడు. తొలుత బాడీ మసాజ్ చేయించుకున్న ఆ ప్రిన్సిపాల్ కోరిక తీర్చాలని ఒత్తిడి తెచ్చాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన విశాఖపట్నం జిల్లా గాజువాకలో చోటు చేసుకుంది.
గాజువాక సీఐ మల్లేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం దరి మారుమూల గిరిజన తండాకు చెందిన నర్సింగ్ విద్యార్థిని కాకినాడలో మూడో సంవత్సరం చదువుతోంది. ప్రాక్టికల్ పరీక్షల కోసం గాజువాక షీలా నగర్లోని మదర్ థెరిస్సా నర్సింగ్ కళాశాలకు వెళ్లాలని యాజమాన్యం సూచించింది. ఇటీవల పరీక్షలు రాయడానికి వచ్చిన ఆ విద్యార్థినిని కళాశాల ప్రిన్సిపాల్ ఎం. వెంకటరావు లైంగిక వేధింపులకు గురిచేశాడని తెలిపారు. తాను చెప్పినట్లు నడుచుకోకపోతే.. పాస్ అవ్వకుండా చేస్తానని బెదిరించాడు. ఒకే రోజు మూడుసార్లు ఒళ్లంతా మసాజ్ చేయించుకున్నాడని.. చివరకు కోరిక తీర్చాలని ఒత్తిడి చేసినట్లు విద్యార్థిని వాపోయింది. దీంతో తన సోదరుడు సాయంతో ఆమె గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రిన్సిపాల్ వెంకటరావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ మల్లేశ్వరరావు తెలిపారు.