- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: సర్దార్ వల్లాభాయ్ పటేల్ 145 జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. శనివారం గుజరాత్లోని నర్మదా నది తీరంలోని సర్ధార్ వల్లభాయ్ పటేల్ ఐక్యతా విగ్రహం వద్ద జరిగిన వేడుల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విగ్రహం వద్ద పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశం కోసం ప్రాణాలర్పించిన వీర సైనికుల త్యాగాలను దేశం ఎప్పటికీ మరువదని తెలిపారు. పుల్వామా దాడి సమయంలో కొందరు సైనికుల పక్షాన నిలవకపోవడం బాధగా అనిపించిందని వెల్లడించారు.
దేశ ప్రయోజనాల కోసం ఇలాంటి రాజకీయాలు మరోసారి చేయవద్దని ఆయన కోరారు. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ అభివృద్ధి పథంలో పయనిస్తుందని తెలిపారు. దేశం కరోనాపై విజయసాధించేందుకు కృషిచేసిన పోలీసులు, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులు తదితర కరోనా యోధులకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. అంతేగాకుండా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలన్నీ ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు.