‘జన్ ఆందోళన్’ ప్రారంభించిన ప్రధాని మోడీ

by  |
‘జన్ ఆందోళన్’ ప్రారంభించిన ప్రధాని మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ విపరీతంగా పాజిటివ్ కేసులు పెరుగుతూ, విలయతాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజల్లో కరోనా ఆందోళనను తొలగిస్తూ… మరింత అవగాహన పొందేలా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ గురువారం ‘జన్ ఆందోళన్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పండుగలు, ఇతర కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని, దీనిని రూపకల్పన చేశారు. ‘మాస్కు ధరించడి.. భౌతికదూరాన్ని పాటించండి.. మనిషికి, మనిషికీ మధ్య దూరం పాటించండి.. కరోనాపై విజయాన్ని సాధించండి’ అంటూ ప్రధాని మోడీ ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.



Next Story