నేతాజీ పుట్టిన గడ్డకు నమస్కారం : ప్రధాని

by  |
నేతాజీ పుట్టిన గడ్డకు నమస్కారం : ప్రధాని
X

దిశ, వెబ్‌డెస్క్: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ పశ్చిమ బెంగాల్‌లో పర్యటించారు. నేతాజీ జయంతిని పురస్కరించుకుని కోల్‌కతాలో విక్టోరియా మెమోరియల్‌లో నిర్వహిస్తున్న‘పరాక్రమ్ దివస్’ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ… నేతాజీ పుట్టిన గడ్డకు నమస్కారం అంటూ తన ప్రసంగం మొదలుపెట్టారు. దేశ స్వాతంత్ర్యం కోసం నేతాజీ ఎంతో కృషి చేశారని అన్నారు. దేశానికి ఆయన చేసిన త్యాగాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. నేతాజీ భారతదేశ ధైర్యానికి ప్రేరణ అన్నారు. ఆయన త్యాగం, భారతదేశానికి ఆయన చేసిన కృషిని గుర్తుంచుకోవడం భారతీయులుగా మనందరి కర్తవ్యమని గుర్తుచేశారు.


Next Story

Most Viewed