ప్రైమరీ కాంటాక్ట్స్..ఆ ఏడుగురికి కరోనా నిల్

by  |

దిశ, మహబూబ్ నగర్ :
నాగర్ కర్నూలు జిల్లా వంగూర్ మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ప్రైమరీ కాంటాక్ట్స్ కుటుంబ సభ్యులు ఏడుగురికి కరోనా నెగిటివ్ వచ్చింది. వీరి శాంపిల్స్‌ను హైదరాబాద్‌లోని కరోనా నిర్దారణ కేంద్రానికి పంపించగా గురువారం సాయంత్రం జిల్లాకు రిపోర్టులు అందినట్లు కలెక్టర్ శ్రీధర్ తెలిపారు.ఆ నివేదికల్లో వారందరికి కరోనా నెగిటివ్ వచ్చిందని వివరించారు.కానీ, ఆ ఏడుగురిని 14 రోజులు వైద్యుల పర్యవేక్షణలో (హోమ్ క్వారంటైన్)లో ఉండాలని సూచించినట్లు జిల్లా పాలనాధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Next Story

Most Viewed