- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, వరంగల్: మహబూబాబాద్ జిల్లాలో ప్రేమికుల పెండ్లి కొత్త ట్రెండ్ను సృష్టించింది. పంతులు కనిపించకుండా.. వేదమంత్రోచ్ఛరణల మధ్య జరిగిన ఆ ప్రేమ వివాహం గురించే అందరూ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే మంత్రాలు వినిపిస్తున్న ఆ పెండ్లిలో పంతులు మాత్రం హాజరుకాలేదు. ప్రత్యక్షంగా పాల్గొనలేదు. పెండ్లి పెద్దలు తాళిబొట్టుతో సహా, పెండ్లికి కావాల్సిన అన్ని రకాల సామాగ్రిని తీసుకొచ్చినప్పటికీ.. పెండ్లిలో కీలకమైన పంతులును మర్చిపోయారు. చివరకు ఎలా పెండ్లి జరిపించాలో తెలియక సతమతమయ్యారు. ఇదే సమయంలో ఆన్లైన్ పుణ్యమా అంటూ వీడియో కాల్లో పంతులును లైన్లోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే పెండ్లి తంతును పూర్తి చేశారు. ఈ వినూత్న వివాహ కార్యక్రమాన్ని అక్కడి వారు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా జిల్లా వ్యాప్తంగా తెగ వైరల్ అవుతోంది.
Next Story