పంచాయతీ కార్యదర్శులపై ఒత్తిడి తగ్గించాలి..

by  |
పంచాయతీ కార్యదర్శులపై ఒత్తిడి తగ్గించాలి..
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శులపై పనిభారంతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారుల ఒత్తిడిని తగ్గించాలని తెలంగాణ పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్ ​రాష్ట్ర అధ్యక్షుడు పి.మధుసూదన్​రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. సంగారెడ్డి జిల్లాలో సూసైడ్ చేసుకున్న జూనియర్​ పంచాయతీ కార్యదర్శి జగన్నాథ్​కు రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శులు నివాళులర్పించారు. అన్ని మండలాల కేంద్రాల్లో నిరసనలు చేపట్టారు.

హైదరాబాద్​లో నిరసన చేపట్టిన అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించారు. అసోసియేషన్​రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్​రెడ్డి మాట్లాడుతూ.. పంచాయతీ కార్యదర్శి ఉద్యోగంలో ఉన్న బాధలన్నీ వివరిస్తూ అన్యాయన్ని క్షుణ్ణంగా రాయడం కలిచివేసిందన్నారు. జగన్నాథ్ ​సూసైడ్​నోట్​లోని అంశాలపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని, నిజాలను నిగ్గు తేల్చి వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​చేశారు.

పంచాయతీ కార్యదర్శుల ఒత్తిళ్లపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని, భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్​ చేశారు. దీనిలో భాగంగా అన్ని జిల్లాల పరిధిలో గురువారం నల్లబ్యాడ్జీలు ధరించి శాంతియుతంగా నిరసనలు చేపట్టామని తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్​ప్రధాన కార్యదర్శి రమేష్ ​తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed