భద్రాచలంలో టెన్షన్.. టెన్షన్.. మావోయిస్టుల బాంబు దాడిలో

by  |
భద్రాచలంలో టెన్షన్.. టెన్షన్.. మావోయిస్టుల బాంబు దాడిలో
X

దిశ, భద్రాచలం : మావోయిస్టులు పోస్టర్ల చెంత అమర్చిన ప్రెషర్ బాంబు పేలడంతో పూజారిగూడెం గ్రామానికి చెందిన ఆలం బ్రహ్మనాయుడు అనే యువకుడు గాయపడ్డాడు. చర్ల శివారు లెనిన్‌కాలనీ సమీపంలోని మామిడితోట దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్లితే.. ఈనెల 13న రాజకీయ ఖైదీలను విడుదల చేయాలనే డిమాండ్‌తో మామిడితోట వద్ద పలు చెట్లకు మావోయిస్టు పార్టీ చర్ల – శబరి ఏరియా కమిటీ పేరుతో పోస్టర్లు వెలిశాయి.

ఆదివారం ఉదయం పూజారిగూడెం నుంచి లెనిన్‌కాలనీ వైపు తన ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఆలం బ్రహ్మనాయుడు రోడ్డు పక్కన చెట్టుకు ఉన్న పోస్టర్ గమనించాడు. అందులో ఏముందో తెలుసుకోవాలనే ఉత్సాహంతో వాహనంపైనే పోస్టరు ఉన్న చెట్టు చెంతకు వెళ్ళి మ్యాటర్ చదువుతుండగా అకస్మాత్తుగా బాంబు పేలడంతో ఎగిరి రోడ్డుపై పడ్డాడు. రక్తస్రావంతో ఉన్న అతడిని హుటాహుటిన బాటసారులు చర్లలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పోస్టర్ల చెంత మావోయిస్టులు బాంబులు పెట్టడం ఎంతవరకు కరక్ట్ అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది. ఇది సామాన్యుల ప్రాణాలకు ముప్పుకాదా అని ఏజెన్సీవాసులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో మావోయిస్టుల చర్య పట్ల ఏజెన్సీ ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి.

Next Story

Most Viewed