ఉలిక్కిపడ్డ భద్రాద్రి కొత్తగూడెం.. పేలిన ప్రెషర్ బాంబు

by  |
ఉలిక్కిపడ్డ భద్రాద్రి కొత్తగూడెం.. పేలిన ప్రెషర్ బాంబు
X

దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్‌కు సరిహద్దుగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల శివారు అటవీ ప్రాంతంలో ప్రెషర్‌ బాంబు బ్లాస్ట్ అయ్యింది. చర్ల మండలం సరిహద్దు ఎర్రంపాడు – బత్తినిపల్లి గ్రామాల నడుమ మావోయిస్టుల కోసం గాలిస్తున్న స్పెషల్ పార్టీ బృందంలోని కానిస్టేబుల్ కృష్ణ ప్రసాద్ మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబు పేలుడు ధాటికి తీవ్రంగా గాయపడ్డారు. ఆయనకు ప్రాథమిక వైద్యం చేయించి హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించారు.

ఆయనకు కాలికి గాయమైందని, ఎలాంటి ప్రాణహాని లేదని పోలీసులు తెలిపారు. 2020 బ్యాచ్‌కు చెందిన కృష్ణప్రసాద్ జిల్లా కేంద్రం కొత్తగూడెంలోని లక్ష్మీదేవిపల్లి‌ నివాసి. ఈ పేలుడు ఘటనతో రెండు రాష్ట్రాల పోలీసులు, స్పెషల్ క్యాంపుల సిబ్బంది అప్రమత్తమై గాలింపులు ముమ్మరం చేశారు. మావోయిస్టుల కట్టడి కోసం ఛత్తీస్‌గఢ్ – తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతంలో ముమ్మరంగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టినట్టు చర్ల సీఐ బి.అశోక్ తెలిపారు.

Next Story

Most Viewed