క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణ

by  |
క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణ
X

న్యూఢిల్లీ : నిర్భయ కేసులోని దోషి పవన్ గుప్తా దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించారు. సుప్రీంకోర్టు.. పవన్ గుప్తా దాఖలు చేసుకున్న క్యురేటివ్ పిటిషన్‌ను డిస్మిస్ చేసిన వెంటనే దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్.. మెర్సీ పిటిషన్‌ను పవన్ గుప్తా పక్షంలో సమర్పించారు. కాగా, ఈ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించారు. కాగా, రేపు ఉదయం ఆరుగంటలకు ఉరి శిక్ష అమలుచేయాలని జారీ చేసిన డెత్ వారెంట్‌పై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ పటియాల కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో రేపు ఉదయం నిర్భయ కేసులోని నలుగురు దోషులకు ఉరి శిక్ష అమలవుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది.

tags : president, Ramnath kovind, rejects, mercy petition, nirbhaya case, pawan gupta

Next Story

Most Viewed