ఆయన ఓ గొప్ప వ్యూహకర్త : రామ్ నాథ్ కోవింద్

by  |
ఆయన ఓ గొప్ప వ్యూహకర్త :  రామ్ నాథ్ కోవింద్
X

దిశ, వెబ్ డెస్క్: అహ్మద్ పటేల్ మృతి పట్ల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతాపం వ్యక్తం చేశారు. అహ్మద్ పటేల్ కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అహ్మద్ పటేల్ గొప్ప వ్యూహకర్త, చురుకైన నాయకుడని ఆయన అన్నారు. పార్టీ శ్రేణుల్లో ఎందరో స్నేహితులను అహ్మద్ పటేల్ సంపాదించుకున్నారని తెలిపారు. అహ్మద్ పటేల్ మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు.సమాజ సేవ చేస్తూ చాలా ఏండ్లు ప్రజా జీవితంలోనే అహ్మద్ పటేల్ గడిపారని మోడీ చెప్పారు. కాంగ్రెస్ బలోపేతంలో ఆయన పాత్ర గుర్తుండి పోతుందన్నారు.


Next Story