తిరుమలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్​

by  |
తిరుమలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్​
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ మంగళవారం తిరుమల రానున్నారు. రేణిగుంట ఎయిర్‌పోర్టులో రాష్ట్రపతికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ స్వాగతం పలకనున్నారు. ముందుగా తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి కోవింద్.. అనంతరం కుటుంబ సమేతంగా వెంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం 3.50గంటలకు తిరిగి అహ్మదాబాద్ వెళ్లనున్నారు. రాష్ట్రపతి పర్యటనలో సీఎం జగన్ 30నిమిషాల పాటు పాల్గొననున్నారు. మరోవైపు రాష్ట్రపతి తిరుమలకు రానున్న నేపథ్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.


Next Story

Most Viewed