కుదుటపడుతున్న రాష్ట్రపతి ఆరోగ్యం..

by Shamantha N |

<p>న్యూఢిల్లీ : భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆరోగ్యం నెమ్మదిగా కుదుట పడుతోంది. తాజాగా ఆయనను ఎయిమ్స్ ఆస్పత్రిలో ఐసీయూ నుంచి ఓ ప్రత్యేక గదికి మార్చినట్టు రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది. రాష్ట్రపతి ఆరోగ్యం కుదుటపడుతోందని తెలిపింది. వైద్యులు ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నట్టు పేర్కొంది. ప్రస్తుతానికి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నట్టు ట్వీట‌ర్‌లో వెల్లడించింది. కాగా ఛాతీలో ఆయనకు కొంత అసౌకర్యంగా అనిపించడంతో గతవారం ఆయన్ను [&hellip;]</p>

కుదుటపడుతున్న రాష్ట్రపతి ఆరోగ్యం..
X

న్యూఢిల్లీ : భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆరోగ్యం నెమ్మదిగా కుదుట పడుతోంది. తాజాగా ఆయనను ఎయిమ్స్ ఆస్పత్రిలో ఐసీయూ నుంచి ఓ ప్రత్యేక గదికి మార్చినట్టు రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది. రాష్ట్రపతి ఆరోగ్యం కుదుటపడుతోందని తెలిపింది. వైద్యులు ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నట్టు పేర్కొంది.

ప్రస్తుతానికి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నట్టు ట్వీట‌ర్‌లో వెల్లడించింది. కాగా ఛాతీలో ఆయనకు కొంత అసౌకర్యంగా అనిపించడంతో గతవారం ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించి బైపాస్ సర్జరీ నిర్వహించిన సంగతి తెలిసిందే.

Next Story