ట్రంప్ విత్ కేసీఆర్..పిలుపొచ్చింది

by  |
ట్రంప్ విత్ కేసీఆర్..పిలుపొచ్చింది
X

దిశ,వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా రాష్ట్రపతి నిలయం ప్రత్యేక విందును ఏర్పాటు చేసింది.ఆ విందుకు హాజరు కావాల్సిందిగా తెలంగాణ సీఎం కేసీఆర్‌కు భారత రాష్ట్రపతి నిలయం నుంచి పిలుపు వచ్చింది.ఇది తెలంగాణ సీఎంకు,తెలంగాణ ప్రజలకు దక్కిన అరుదైన గౌరవంగా అందరూ భావిస్తున్నారు. కావున, ఈనెల 25 ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లనున్నట్టు సమాచారం. ఈ విందులో ట్రంప్ దంపతులు, రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోడీతో పలువురు అమెరికా, భారత ప్రతినిధులు పాల్గొననున్నారు.అందుకోసం ఇప్పటికే ప్రెసిడెన్సియల్ హౌస్ ప్రత్యేకమైన ఏర్పాట్లను చేసింది.విశిష్ట అతిథికోసం బంగారు ప్లేట్లు, వెండి పాత్రల్లో విందు ఇవ్వనున్నట్టు సమాచారం.


Next Story

Most Viewed