- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ : వైద్యులపై దాడిని నాన్ బెయిలబుల్ నేరంగా పరిగణించి.. గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష విధించాలన్న ఆర్డినెన్స్ను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదించారు. కరోనా మహమ్మారితో పోరాడుతున్న వైద్యులపై దేశవ్యాప్తంగా దాడులు జరుగుతున్న తరుణంలో కేంద్ర క్యాబినెట్.. దాడులకు పాల్పడుతున్నవారిని కఠినంగా శిక్షించాలని మంగళవారం మధ్యాహ్నం ఓ ఆర్డినెన్స్ను తీసుకొచ్చింది. ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ 1897కు సవరణలు చేస్తూ వైద్యులపై దాడి చేసినవారికి మూడు నెలల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 50వేల నుంచి రూ. ఐదు లక్షల వరకు జరిమానా విధించాలని నిర్ణయించింది. ఈ ఆర్డినెన్స్కు తాజాగా, బుధవారం రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.
Tags: president, ordinance, cabinet, doctors, attack, punishment
Next Story