ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు

by  |
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోన్నది. ఆదివారం ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో మొత్తం 196 కేసులు నమోదు కాగా, అందులో జీహెచ్ఎంసీ పరిధిలో 122, రంగారెడ్డి జిల్లాలో 40, మేడ్చల్ 10, ఖమ్మం జిల్లాలో 9, మెదక్, జగిత్యాల్, మహబూబ్ నగర్ జిల్లాలలో 3 చొప్పున, వరంగల్ అర్భన్ జిల్లాలో 2, సూర్యాపేట, నిర్మల్, జనగాం, యాదాద్రి జిల్లాలో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 2698 కు చేరుకుంది. అందులో 1428 మంది బాధితులు కోలుకోగా, 1188 మంది చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు కరోనా సోకి మృతిచెందిన వారి సంఖ్య 82 కు చేరుకుంది.

Next Story

Most Viewed