- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, బోధన్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఓ గర్భిణీ మహిళ 108 అంబులెన్సులోనే డెలివరీ అయ్యింది. పండంటి ఆడబిడ్డకు జన్మించినట్టు అంబులెన్స్ సిబ్బంది తెలిపారు. సోముపూర్ గ్రామానికి చెందిన శ్రీదేవి (భర్త దత్తాత్రేయ)కి ఇంట్లో అకస్మాత్తుగా పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబసభ్యులు 108 అంబులెన్స్కు ఫోన్ చేయగా వారు హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు.
గర్భిణీ మహిళను అంబులెన్సులో ఎక్కించుకుని తమ ఇంటి నుంచి తరలించే క్రమంలో పురిటినొప్పులు తీవ్రతరం కావడంతో అంబులెన్స్ సిబ్బంది వాహనంలోనే డెలివరీ చేశారు. సాధారణ ప్రసవం ద్వారా పండంటి ఆడపిల్లకు ఆ మహిళ జన్మనిచ్చిందని వెంకటేశ్వర్లు, పైలెట్ కేశవ్ కుమార్ తెలిపారు.అనంతరం తల్లిబిడ్డలను బోధన్ జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు పేర్కొన్నారు.
Next Story