బిడ్డకు జన్మనిచ్చి తల్లి మృతి.. బెడ్‌పై వదిలేసి డాక్టర్ పరార్

by  |
Pregnant woman died
X

దిశ, ఆలేరు: యాదాద్రి-భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి అయింది. వివరాళ్లోకి వెళితే… ఆలేరు మండలం గోలనుకొండకు చెందిన రొయ్యల ఉష(23) అనే ఓ నిండు గర్భిణీ పురితినొప్పులతో పట్టణంలోని సుధా నర్సింగ్ హోమ్‌లో చేరింది. డెలివరీ కోసం ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకెళ్లి ఆపరేషన్ చేస్తుండగా బిడ్డకు జన్మనిచ్చి తల్లి సుధ మృతిచెందింది. ఆపరేషన్ చేస్తుండగా గర్భిణికి ఆక్సిజన్ అందకపోవడంతో అక్కడికక్మడే మృతిచెందింది. దీంతో మృతదేహాన్ని ఆపరేషన్ థియేటర్‌లోని బెడ్ పైనే వదిలేసి డాక్టర్ ప్రతాప్ రెడ్డితో పాటు వైద్య సిబ్బంది పరారయ్యారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే ఆక్సిజన్ అందక సుధ మృతి చెందిందని మృతురాలి కుటుంభ సభ్యులు ఆందోళనకు దిగారు.


Next Story

Most Viewed