డెలివరీ అయిన గంటల వ్యవధిలోనే మహిళ మృతి

by  |
డెలివరీ అయిన గంటల వ్యవధిలోనే మహిళ మృతి
X

దిశ, పెద్దపల్లి: ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో బాబుకు జన్మనిచ్చిన వివాహిత మరణించడంతో బంధువులు ఆస్పత్రి ముందు ధర్నా చేపట్టారు. పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్ గ్రామానికి చెందిన మిట్టపల్లి అనూష 26 (గర్భిణీ) డెలివరీ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా బాబుకు జన్మనిచ్చింది. కాగా, ఆసుపత్రి సిబ్బంది అర్ధరాత్రి హుటాహుటిన డెలివరీ అయిన అనూషకు ఫిట్స్ వచ్చిందంటూ హుటాహుటిన కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని సూచనలు చేశారు. ఈ క్రమంలో కరీంనగర్ తరలించేసరికి అప్పటికే ఆ వివాహిత మరణించిందని అక్కడి వైద్యులు ధృవీకరించారు. దీంతో బాధిత బంధువులు మరణించిన వివాహిత శవంతో పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా చేపట్టారు. డ్యూటీలో ఉన్న డాక్టర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.



Next Story