కేకేఆర్ టీంలో మరో కీలక ఆటగాడికి కరోనా..

by  |
కేకేఆర్ టీంలో మరో కీలక ఆటగాడికి కరోనా..
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. అయితే, కరోనా కారణంగా ఐపీఎల్ లీగ్ వాయిదా పడింది. చెన్నై, కేకేఆర్ జట్టులో పలువురు ప్లేయర్స్ కరోనా బారినపడిన విషయం తెలిసిందే. తాజాగా కేకేఆర్ జట్టులో మరో పేసర్ కరోనా బారినపడ్డాడు. భారత పేస‌ర్ ప్రసిద్ద్ కృష్ణకు చేసిన క‌రోనా పరీక్షలో అతడికి పాజిటివ్‌గా తేలింది. దీంతో కేకేఆర్ జట్టులో కరోనా సోకిన ఆటగాళ్ల సంఖ్య నాలుగుకు చేరింది. ఆ టీంలో ఇప్పటికే వ‌రుణ్ చ‌క్రవ‌ర్తి, సందీప్ వారియ‌ర్‌, న్యూజిలాండ్ ఆటగాడు టిమ్ సీఫెర్ట్ క‌రోనా బారిన‌ప‌డ్డారు.

Next Story

Most Viewed