ఓటీటీలో విడుదలకు సిద్ధమైన ‘ప్రణవం’

by  |
ఓటీటీలో విడుదలకు సిద్ధమైన ‘ప్రణవం’
X

దిశ, వెబ్ డెస్క్‌: చిన్న సినిమాలకు ఓటీటీ వరంగా మారింది. లాక్‌డౌన్ వల్ల సినిమా థియేటర్లు మూత పడటంతో..షూటింగ్‌లు పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉన్న చిత్రాలన్నీ ఓటీటీలో విడుదల చేసేందుకు దర్శక, నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. మంచి రేటుతో పాటు..ప్రస్తుతం ఓటీటీల ట్రెండ్ నడుస్తుండటంతో నిర్మాతలకు ఇది ఉత్తమ మార్గంగా కనిపిస్తుంది. ఇటీవలే కృష్ణ అండ్ హిజ్ లీల, భానుమతి, అండ్ రామకృష్ణ మూవీస్ ఓటీటీల్లోనే విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకున్నాయి. ఈ క్రమంలోనే .. ‘ఈ రోజుల్లో’ ఫేం శ్రీ మంగం, సై ఫేం శశాంక్ నటించిన ‘ప్రణవం’ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నద్ధమవుతున్నారు.

ల‌వ్ అండ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘ప్రణవం’.ఈ మూవీకి కుమార్‌ జి. దర్శకత్వం వహించగా, తనూజ.ఎస్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు పద్మారావు భరద్వాజ్ సంగీతం అందించారు. చాలా కాలం త‌ర్వాత ఇందులో ఆర్‌.పి. ప‌ట్నాయ‌క్, ఉష క‌లిసి ఓ పాట‌ను పాడ‌టం విశేషం. ‘క‌థ‌కు త‌గ్గట్లుగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను చాలా రిచ్‌గా నిర్మించాం. పాట‌లు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ బాగా కుదిరాయి. ఓటీటీ ద్వారా మా ప్రణవం చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని నిర్మాత అన్నారు. శ్రీ మంగం, శశాంక్‌ హీరోలుగా చేస్తుండగా, గాయత్రి అయ్యర్, అవంతికి హరి నల్వాలు హీరోయిన్లు నటిస్తున్నారు. జెమిని సురేష్‌, నవీన, జబర్దస్త్‌ బాబి, దొరబాబు, సమీర ఇతర పాత్రలు పోషిస్తున్నారు.



Next Story