పారా బ్యాడ్మింటన్ టోర్నో ఫైనల్‌లో ప్రమోద్, సుకాంత్

by  |
పారా బ్యాడ్మింటన్ టోర్నో ఫైనల్‌లో ప్రమోద్, సుకాంత్
X

దిశ, స్పోర్స్ : ఇండియాకు చెందిన ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకర్ పారా బ్యాడ్మింటన్ ఆటగాడు ప్రమోద్ భగత్, వరల్డ్ నెంబర్ 5 ర్యాంకర్ సుకాంత్ కదమ్ దుబాయ్‌లో జరుగుతున్న పారా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఫైనల్‌కు చేరుకున్నారు. శనివార జరిగిన ఎస్ఎల్3 కేటగిరీ సెమీస్‌లో మలేషియాకు చెందిన మహమ్మద్ హజారీతో తలపడిన భగత్ 21-7, 21-17 తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకున్నాడు. ఆదివారం జరుగనున్న ఫైనల్‌లో కుమార్ నితీష్‌తో తలపడనున్నాను. ఎస్ఎల్ 4 కేటగిరీ సెమీస్‌లో జర్మనీకి చెందిన మార్సెల్ ఆడమ్‌తో తలపడిన సుకాంత్ కదమ్ 21-11, 21-11 తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకున్నాడు.

పురుషుల డబుల్స్ సెమీస్‌లో ప్రమోద్-మనోజ్ శకంర్ జంట ఇండియాకు చెందిన మహ్మద్ అన్సారీ, దీప్ రంజన్‌పై 21-19, 23-21 తేడాతో విజయం సాధించారు. ఫైనల్‌లో ఇండియాకు చెందిన సుకాంత్ కదమ్-కుమార్ నితీష్ జోడీతో తలపడనున్నారు. మిక్స్‌డ్ డబుల్స్ సెమీస్‌లో ఇండియాకు చెందిన ప్రమోద్-పాలా కోహ్లీ జోడి ఫ్రాన్స్‌కు చెందిన లూకాస్ మజుర్-ఫౌస్టీన్ నోయల్ జోడీపై 17-21, 5-21 తేడాతో ఓడిపోయారు.

Next Story